భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా సంస్థలు ఎన్నికల సర్వే ఫలితాలను రిపోర్ట్ చేస్తున్నాయి. అందరి దృష్టి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది.
తాజాగా ఓట్ వైబ్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం అన్నాడీఎంకే కూటమి 114 నుంచి 124 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. డీఎంకే కూటమికి 103 నుంచి 113 సీట్లు, విజయ్ టీవీకే 4 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా. ఓట్ల శాతం విషయానికి వస్తే అన్నాడీఎంకేకు 39.9 శాతం ఓట్లు పోలయ్యాయి. డీఎంకేకు 38.9 శాతం, టీవీకే 15.8 శాతం, ఇతర పార్టీలకు 3.5 శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.

రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరిగింది. తుది ఓటరు జాబితా ప్రకారం 5.73 కోట్ల మంది ఓటర్లలో 85.15% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, నామ్ తమిళర్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేయగా, రాందాస్-శశికళ ప్రత్యేక కూటమిగా ఏర్పడి, కృష్ణస్వామి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు.
ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు కావాలి. ఈ ప్రధాన పార్టీలకు నటుడు విజయ్ గట్టి సవాల్ విసిరారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్య తేడా ఒక్క శాతం మాత్రమేనని, అందుకే గెలుపు ఓటము మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. Axis MyIndia అంచనాలు మరింత సూక్ష్మంగా ఉన్నాయి మరియు TVKకి ఊహించని విజయాన్ని సూచిస్తున్నాయి. DMK+కి 92-110 సీట్లు, ఏఐఏడీఎంకేకి 22-32 సీట్లు వస్తాయి. విజయ్ టీవీకే ఏకంగా 98-120 సీట్లు వస్తాయని అంచనా.
