క్రీడలు
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ రేస్ (IPL 2026 ప్లేఆఫ్స్ రేస్) ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికే పూర్తయిన మ్యాచ్ లు, ఆయా జట్లు సాధించిన పాయింట్ల ఆధారంగా ప్లే ఆఫ్ రేసు తేటతెల్లమవుతోంది. అలాగే టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లపైనా క్లారిటీ వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ అంచనాలు, ఇతర అంశాల ఆధారంగా ప్లే ఆఫ్కు అర్హత సాధించే అవకాశం ఉన్న జట్లు, ఇతర జట్ల అవకాశాలపై ఓ లుక్కేద్దాం.
ఏప్రిల్ చివరి నాటికి IPL 2026 ప్లేఆఫ్ల రేసు వేడెక్కుతోంది. మార్కెట్ డేటా మరియు నిపుణుల విశ్లేషణ ఆధారంగా
పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం ప్లేఆఫ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వారికి మంచి అవకాశం ఉంది. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలో వెనుకబడినప్పటికీ ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. ముంబయికి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి.

ఐపీఎల్ 2026లో 10 జట్లు మొత్తం 74 మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రతి జట్టు 14 లీగ్-స్టేజ్ మ్యాచ్లలో (మొత్తం 70) పోటీపడుతుంది. ఛాంపియన్ను నిర్ణయించడానికి 4 ప్లేఆఫ్ మ్యాచ్లు ఆడతారు. లీగ్ దశ తర్వాత టాప్ 4 జట్లు అదనంగా 4 నాకౌట్ గేమ్లు ఆడతాయి. అవి క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మరియు మే 31న ఫైనల్. ఈ జట్లు ఏవీ ఈ 4 గేమ్లలో ఆడవు. సాధారణంగా వీటిలో 3-4 జట్లు ఆడతాయి. టోర్నీ సాగుతున్న కొద్దీ వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆర్సీబీ, సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, లక్నో తలా 8 మ్యాచ్లు ఆడాయి.
మిగిలిన జట్లు ఏడు మ్యాచ్లు ఆడాయి. టాప్ 4 జట్లలో పంజాబ్ 7 మ్యాచ్లు ఆడి 13 పాయింట్లతో ముందంజలో ఉంది. ఆర్సీబీ 8 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్లు, 5 మ్యాచ్లు గెలిచిన సన్రైజర్స్ 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా 8 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచినా రన్ రేట్ కారణంగా నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ నాలుగు జట్లకు ప్లేఆఫ్కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
