భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
తమిళనాడులో శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే అందరి దృష్టి మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపైనే ఉంది.ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ ఎన్నికల్లో కొత్త రాజకీయ శక్తిగా విజయ్ ఎంట్రీ ఇవ్వడమే. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపు మార్జిన్ను తగ్గించడమే కాకుండా ఫలితాలను తారుమారు చేయగలదని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
హైకోర్టులో విజయ్కి భారీ ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయ్ ప్రకటించిన ఆస్తుల అఫిడవిట్పై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఎస్ఏ ధర్మాధికారి, జీ అరుల్ మురుగన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

ఈ పరిణామాల మధ్య విజయ్ ఈరోజు తమిళనాడులోని ప్రసిద్ధ తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం తూత్తుకుడి జిల్లాలో ఉంది. ఈరోజు తెల్లవారుజామున ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరారు. తూత్తుకుడి విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ తెల్లవారు జామున స్వామివారి విశ్వరూప దర్శన పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట టీవీకే ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్, జగదీష్ బ్లిస్ ఉన్నారు. విజయ్ మెడలో హారం కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని కరుంగళి మాలగా పరిగణిస్తారు. కౌంటింగ్ విషయంలో విజయ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే డీఎంకే, అన్నాడీఎంకేలకు బయటి నుంచి మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. తిరుచెందూర్. ఇక్కడ మురుగన్ పూజలందుకుంటున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిగించిన ఆరు ప్రసిద్ధ దివ్య క్షేత్రాలలో ఇది రెండవది. ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రజలు ‘అరుపడై వీడు’ అని పిలుస్తారు. యుద్ధంలో శూరపద్ముడిని సంహరించిన సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే చేసిన కార్యాలలో విజయం చేకూరుతుందని విశ్వాసం.
