వినోదం
ఓయ్-గరికపాటి రాజేష్
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చారిత్రక నేపథ్యంలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కథను పూర్తిగా మార్చి ముంబై మాఫియా బ్యాక్డ్రాప్గా ఎంచుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య మోస్ట్ పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునేలా డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లతో గోపీచంద్ ఈ స్క్రిప్ట్ను అద్భుతంగా రూపొందించారని తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార, కాజల్ లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అనేది అందరికంటే హైలైట్.
ఇద్దరు హీరోయిన్లతో నటించబోతున్న బాలయ్య
ఈ చిత్రంలో నయనతార, కాజల్లు కలిసి నటించబోతున్నారని ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి’ హిట్తో బాలయ్య-కాజల్ కాంబినేషన్కి మంచి క్రేజ్ రావడంతో ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ను రిపీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. బాలయ్య-నయనతార కాంబో సూపర్ హిట్ కాంబో. వీరిద్దరూ కలసి నటిస్తే సినిమా హిట్ కావడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ పూర్తి చేయగా, రెండో షెడ్యూల్ కోసం ముంబైలో భారీ సెట్టింగులు వేశారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సెషన్స్ కూడా పూర్తయ్యాయని, థమన్ తన ట్రేడ్మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాడని టాక్. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజస్థాన్లో కూడా షూటింగ్ జరుగుతోంది.
దసరా కోసమో, సంక్రాంతి కోసమో
50 ఏళ్ల వరుస సినిమా ప్రస్థానం పూర్తి చేసుకున్న తరుణంలో బాలయ్య 111వ సినిమా వస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత గోపీచంద్-బాలయ్య కాంబో మళ్లీ బాక్సాఫీస్ వద్ద రిపీట్ కాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. 2026 విజయదశమి లేదా 2027 సంక్రాంతి రేసులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా దసరాకి పూర్తయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నారు.
