భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన 16 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను NDA కూటమి (NRC+) సులభంగా దాటుతుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఈ కూటమికి 16 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఓట్ల శాతంలో ఎన్డీయే 40 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.

ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని AINRC ఒంటరిగా 10-12 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. బీజేపీ 4-6 సీట్లు, ఏఐఏడీఎంకే 1-2 సీట్లు, ఎల్జేకే 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16-17. ప్రత్యర్థి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి 10-12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, ఇతరులు 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
