వినోదం
ఓయ్-జక్కీ మహేష్
కన్నడ స్టార్ యష్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో యష్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఓ బోల్డ్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఇండియన్ సినిమాల్లో కనిపించేలా కాకుండా చాలా డిఫరెంట్ గా, సాహసోపేతంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
చిత్రబృందంలో భిన్నాభిప్రాయాలు
ఈ సీన్ గ్లామర్ పరంగానే కాకుండా మేకింగ్ స్టైల్ పరంగా కూడా చాలా కొత్తగా ఉండబోతోందని సమాచారం. అయితే ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేక వివాదాలకు దారి తీస్తుందా అనే విషయంపై చిత్ర బృందంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సన్నివేశం సినిమాకే ప్రత్యేక గుర్తింపునిస్తుందని చిత్రబృందంలోని కొందరు భావిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి సందర్భాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతాయి.

ఓ అడుగు వెనక్కి వేసిన హీరోయిన్
మరోవైపు ఈ సీన్ వల్ల సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్ కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ కియారా అద్వానీ ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సీన్ తనకు ఇప్పటి వరకు వచ్చిన క్లీన్ ఇమేజ్కి భంగం కలిగిస్తుందని.. అందుకే ఆ సీన్ని తొలగించాలని లేదంటే ఇంటెన్సిటీని తగ్గించాలని మేకర్స్ని కోరుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి ఈ విషయంలో యష్ మరియు దర్శకుడు గీతు మోహన్ దాస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇలా బోల్డ్ రిస్క్ చేస్తే సినిమాకు హైప్ పెరుగుతుందా.. లేక అనవసరమైన ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అని ఆలోచిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాలోని సీన్ ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
