క్రీడలు
ఓయ్-చంద్రశేఖర్ రావు
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కు తీపి కబురు అందనుంది. ఆయన మరికొంత కాలం చీఫ్ సెలక్టర్గా కొనసాగనున్నారు. ప్రస్తుత పదవీకాలం ఈ ఏడాది జూన్తో ముగియాల్సి ఉండగా.. తాజాగా దాన్ని పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. జూన్ 2027 వరకు అంటే మరో ఏడాది పాటు ఇదే పదవిలో కొనసాగుతారు. రానున్న ముఖ్యమైన టోర్నీలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం టీమ్ ఇండియా ఘనవిజయం సాధిస్తున్న పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీలో ఎలాంటి మార్పులు చేయకతప్పదని భావిస్తున్నారు. అగార్కర్ నాయకత్వంలో టీం ఇండియా ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తిగా మారింది. ఆయన హయాంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఇందుకు నిదర్శనం. అగార్కర్ హయాంలో జట్టులో మార్పులు సజావుగా జరిగాయని తేల్చారు. అతడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు జట్టుకు అనుకూలించాయని, అందుకే అతడిని కొనసాగించాలని బోర్డు కోరుతున్నదని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనాన్ని ప్రచురించింది.

RP సింగ్ మరియు ప్రజ్ఞాన్ ఓజా వంటి సభ్యులు ఎంపిక ప్యానెల్లో ఇంకా ఒక సంవత్సరం పూర్తి చేయనందున, అగార్కర్ను కొనసాగించడం ఎంపిక ప్రక్రియకు స్థిరత్వాన్ని తెస్తుందని బోర్డు అభిప్రాయపడింది. అగార్కర్ నాయకత్వంలో, భారతదేశం వారి సుదీర్ఘ ICC టైటిల్స్ కరువును ముగించింది. ఇది వరుసగా 2024 మరియు 2026లో T20 ప్రపంచ కప్లను మరియు గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు చేరుకుంది.
వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్లో మరో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ లీడర్షిప్లో స్థిరత్వం కీలకమని బోర్డు భావిస్తోంది. అజిత్ అగార్కర్ పదవీకాలం భారత క్రికెట్లో కీలక మలుపు తిరిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి గొప్ప ఆటగాళ్లు టెస్టు క్రికెట్కు దూరమయ్యారు. అదే సమయంలో టెస్టుల్లో శుభ్మన్ గిల్, టీ20లో సూర్యకుమార్ యాదవ్ వంటి కొత్త నేతలు జట్టు పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో సెలక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడలేదు.
