ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వానలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న మూడు రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా జిల్లాలకు ముఖ్యమైన సూచనలు ఇవ్వబడ్డాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతూ, ఉత్తర తమిళనాడు పరివాహక ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయల ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఇదిలా ఉండగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ, కర్ణాటకల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

వడగళ్ళు.. మరియు వర్షాలు
కాగా, ఉదయం ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 12 నుంచి పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. 13 నుంచి 17వ తేదీ వరకు వాతావరణం కొనసాగుతుంది. ఇక.. అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని అంచనా.
