ధోని పునరాగమనంపై CSK మేనేజ్‌మెంట్ నిర్ణయం, తదుపరిది…!! | అంతా అనుకున్నట్లు జరిగితే MS ధోని ఈ వారం తర్వాత CSK ప్లేయింగ్ XIకి తిరిగి రావచ్చు, వివరాలు ఇక్కడ ఉన్నాయి

క్రీడలు

ఓయ్-సాయి చైతన్య

IPL 2026: CSK లీగ్ దశకు ప్రారంభం కావడం ఈసారి కలిసి రాలేదు. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసుకుంది. స్టార్ ప్లేయర్ ధోనీ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. రెండు వారాల తర్వాత ధోనీ జట్టులోకి వస్తాడని ఐపీఎల్ ప్రారంభంలోనే ప్రకటించారు. ఇప్పుడు వరుస పరాజయాలతో ధోని రీఎంట్రీ ముందుగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ధోనీ పునరాగమనంపై చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.

CSK చాలా అంచనాలతో IPL 2026లోకి ప్రవేశించింది మరియు ఇప్పటివరకు అభిమానులను నిరాశపరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ తరుణంలో అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి కోలుకుంటున్న ధోని ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించాడు. ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. అంతా సవ్యంగా సాగితే వచ్చే మ్యాచ్ నుంచి ధోనీ మైదానంలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరీక్షను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని బృందం వెల్లడించింది. ధినీ ఫిట్‌గా ఉంటాడని జట్టు కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనీ త్వరలో జట్టులోకి అడుగుపెట్టి చెన్నైని మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి తీసుకువస్తాడని CSK అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

ms-ధోని-సిఎస్‌కె-ప్లేయింగ్-కు-ఈ-వారం-తరువాత-అంతా-ప్రణాళిక-ఇక్కడ-వెళ్లినట్లయితే-ఇక్కడ-డిటా-కు తిరిగి రావచ్చు

ఢిల్లీ మ్యాచ్‌లో ధోనీ అందుబాటులో ఉన్నాడు

కాగా, CSK తమ తదుపరి మ్యాచ్‌ని ఈ నెల 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ సొంత మైదానంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనే మళ్లీ జట్టులోకి అడుగుపెట్టేందుకు ధోనీ సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ధోనీ తడబడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కాస్త ఇబ్బందిగా కనిపించిన ధోనీ ఇప్పుడు మామూలుగా కనిపిస్తున్నాడు. కాగా, ఆదివారం జరిగే ఆర్సీబీ మ్యాచ్ లోనే ధోనీ ఎంట్రీ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదన్న టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంతో ధోనీ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌కి ధోనీ కచ్చితంగా మైదానంలోకి అడుగుపెడతాడని అంటున్నారు. ధోనీతో పాటు బ్రెవిస్ కూడా జట్టుకు మైనస్‌గా మారాడు. ఇప్పుడు ధోనీతో పాటు బ్రెవిస్ కూడా కోలుకుంటున్నాడు. ఢిల్లీ మ్యాచ్‌లో వీరిద్దరూ రీఎంట్రీ ఇస్తారని అంటున్నారు. దీంతో.. సీఎస్‌కే మళ్లీ విజయపథంలోకి వస్తుందని ఆశిస్తున్నా.

More posts