భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ మరియు అమెరికా మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, అక్కడ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని పోలి ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు పెరగడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచ దేశాలకు భారీ షాక్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసిన తర్వాత అక్కడికి వెళ్లిన నౌకలను బలవంతంగా వెనక్కి పంపుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారత్లో చమురు సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటి వరకు దేశ ప్రజలకు కావాల్సినన్ని నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం. ఈ క్రమంలో భారత్కు జాక్పాట్ తగిలింది. దేశంలోనే అత్యధిక మొత్తంలో పెట్రోలియం ఉన్న రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్లో భారీ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. 19 బావుల ద్వారా రోజుకు దాదాపు 1,202 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్పై కొంతమేర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఆర్థికంగా మరింత శక్తివంతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల, రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతంలో భారీ చమురు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఫలితంగా భారత్లో ముడి చమురు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలోని భగేవాలా ప్రాంతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ముడి చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు సమాచారం.

గతేడాది ఈ ప్రాంతంలో 707 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరిగింది. కానీ ప్రస్తుతం 1200 బ్యారెళ్లకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు. అంటే కొన్ని నెలల్లో ఉత్పత్తి దాదాపు 70 శాతం పెరిగింది. భారీ చమురు నిక్షేపాలను కనుగొనడంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 19 బావులు ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే మరో 13 కొత్త బావులను తవ్వి పరీక్షిస్తున్నారు. ఒకవైపు హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత లేకుండా చమురు నిక్షేపాలు బయటపడడం భారత్కు జాక్పాట్ అని నిపుణులు అంటున్నారు.
