భారతదేశం
-కొరివి జయకుమార్
పశ్చిమ బెంగాల్లోని ఝర్గ్రామ్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి ఏనుగు రావడంతో ఓటర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్థానికులు సంబంధిత దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.
స్థానికంగా “రామ్లాల్” అని పిలువబడే ఏనుగు ఓటు వేయడానికి ప్రజలు తరలివస్తున్న సమయంలో పోలింగ్ బూత్ వద్దకు చేరుకుంది. బయట పార్క్ చేసిన గూడ్స్ వాహనం వద్దకు వెళ్లి అక్కడ కాసేపు ఉండి ఎవరికీ హాని కలగకుండా ముందుకు సాగింది.

ఊహించని దృశ్యం ప్రజలను ఆకర్షించడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఏనుగుల సంచారం గురించి సమాచారం అందుకున్న లోధాషులి రేంజ్ అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఏనుగును సురక్షిత ప్రాంతానికి మళ్లించారు.
ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి సంఘటనలను పర్యవేక్షించేందుకు ‘ఐరావత్’ వాహనంతో కూడిన 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ఏనుగుల ట్రెక్కర్లతో కూడిన క్విక్ రెస్పాన్స్ యూనిట్ను నియమించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరుతున్నారు.
వీడియో | పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: ఝర్గ్రామ్లోని జితుసోల్ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ స్టేషన్ సమీపంలో ఏనుగు ప్రవేశించింది.
(మూలం: మూడవ పక్షం)#AssemblyPolls WithPTI #పశ్చిమబెంగాల్ పోల్స్ విత్PTI
(పూర్తి వీడియో PTI వీడియోలలో అందుబాటులో ఉంది – https://t.co/n147TvrpG7) pic.twitter.com/UN6axPscmO
— ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (@PTI_News) ఏప్రిల్ 23, 2026
