ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ప్ర స్తుతం దేశ వ్యాప్తంగా నియోజ క వ ర్గాల పున ర్విభ జ న పై వాడివేడిగా చ ర్చ జ రుగుతోంది. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న వాదనలు, అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ గళాన్ని వినిపిస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు.
ఈ పరిణామాల మధ్య ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ సీట్ల పునర్విభజన ఏపీ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.

ఈ పునర్విభజనలో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం కూడా జనాభా లెక్కల ప్రాతిపదికన జరుగుతోందని తెలిసింది. దీని ఆధారంగానే అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల రొటేషన్ కూడా ఇందులో భాగమే.
దీనివల్ల ఏ నియోజకవర్గమూ శాశ్వతంగా రిజర్వ్ కాలేదు. ఇది ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించదు. రాష్ట్రపతి నియమించిన డీలిమిటేషన్ కమిషన్ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇందులో సభ్యులు. ఈ కమిషన్ నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేరు. ఈ మొత్తం వ్యవహారం వైఎస్సార్సీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని సమాచారం.
పులివెందుల సీటు ఎస్సీ రిజర్వ్డ్గా మారితే పక్కనే ఉన్న జమ్మలమడుగు నుంచి జగన్ పోటీ చేస్తారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ మద్దతుతో ఎన్డీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పులివెందులను ఎస్సీ రిజర్వ్డ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయేను, కమిషన్ను ప్రభావితం చేసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 90 వేల వరకు ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు.
