క్రీడలు
oi-ఉప్పల శివప్రసాద్
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎట్టకేలకు IPL 2026 సీజన్లో మొదటి విజయాన్ని అందుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏకపక్షంగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను 65 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తొలుత విధ్వంసక బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని అందించిన బ్యాట్స్మెన్.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి కేకేఆర్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) దూకుడుగా ఆడారు. నితీష్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 39) ఫర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజ్రబానీ (4/41) నాలుగు వికెట్లు తీయగా, వైభవ్ అరోరా (2/47) రెండు వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగి, అంకుల్ రాయ్ చెరో వికెట్ తీశారు.

ఆ తర్వాత కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 35), ఫిన్ అలెన్ (7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ (3/21) మూడు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ (2/14), నితీష్ కుమార్ రెడ్డి (2/17) రెండేసి వికెట్లు తీశారు. హర్షదుబేకి ఒక వికెట్ దక్కింది.
రనౌట్.. టర్నింగ్ పాయింట్..
227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆరంభంలో తడబడి అనవసర రనౌట్లతో మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా అసాధారణ బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ చేసిన రఘు వంశీ రెండు రనౌట్లకు కారణమయ్యాడు. ఇందులో, అతను తన తోటి బ్యాటర్ కామెరాన్ గ్రీన్ను త్యాగం చేయడం ద్వారా రక్షించాడు, కానీ అతను రెండవ సారి మూల్యం చెల్లించాడు.
అతను అనవసరమైన పరుగు చేసి కామెరాన్ గ్రీన్ (2)ను రనౌట్ చేసిన తర్వాత రింకూ సింగ్తో రెండోసారి మిస్ మ్యాచ్ చేశాడు. ముఖ్యంగా రింకూ సింగ్తో కలిసి ఐదో వికెట్కు 46 పరుగులు జోడించిన తర్వాత అతను రనౌట్ అయ్యి కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు. ఎషాన్ మలింగ వేసిన అద్భుతమైన త్రో రఘువంశీని రనౌట్ చేసింది. ఈ రనౌట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఈ రనౌట్ కాకుండా రఘువంశీ కాసేపు క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆ తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
