ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
వైసీపీ ఎంపీగా ఒకప్పుడు కేంద్రంలో, ప్రధాని మోదీ వద్ద మంచి మార్కులు కొట్టేసిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత రూటు మార్చుకుని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కూడా బీజేపీపై, కేంద్రంపై తన వైఖరిని వదులుకోలేని విజయసాయిరెడ్డి వరుసగా ట్వీట్లు చేస్తూ.. ఇప్పుడు మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా తిరస్కరిస్తున్నట్లు సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కేంద్రం తాజాగా కమర్షియల్ ఎల్పీజీ సైక్లిండర్ ధరను రూ.933 పెంచింది. దీంతో ప్రస్తుతం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 3వేలు దాటింది. దీంతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. కమర్షియల్ LPG సిలిండర్ ధర ₹2,031 నుండి ₹3,024కి, అంటే ₹933కి పెరగడం భారతదేశంలోని 5 లక్షలకు పైగా రెస్టారెంట్లకు భారీ షాక్ అని ఆయన అన్నారు.

కమర్షియల్ LPG సిలిండర్ను ₹2,031 నుండి ₹3,024కి ₹933 పెంచడం భారతదేశం అంతటా 5 లక్షల+ రెస్టారెంట్లకు భారీ షాక్. వారి మార్జిన్లు అణిచివేయబడతాయి, ధరలు పెరుగుతాయి మరియు వేతన కోతలు మరియు ఉద్యోగ నష్టాల ద్వారా కార్మికులు భారాన్ని భరిస్తారు. ఈ వ్యయ స్పైరల్ రెండు వ్యాపారాలను దెబ్బతీస్తుంది…
— విజయసాయి రెడ్డి వి (@VSReddy_MP) మే 2, 2026
కేంద్రం తీసుకున్న గ్యాస్ ధర పెంపు నిర్ణయంతో రెస్టారెంట్ల లాభాలు పూర్తిగా దెబ్బతింటాయని, ధరలు పెరిగిపోయి కూలీలు వేతనాల కోత, ఉపాధి నష్టాల రూపంలో తీవ్ర భారం పడాల్సి వస్తోందని సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరల పెరుగుదల వ్యాపారాలు మరియు వినియోగదారులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. ఈ ఇరాన్ యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపి ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
