సినిమా
ఓయ్-గరికపాటి రాజేష్
టాలీవుడ్ ‘గాడ్ ఆఫ్ మాస్’ నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథల దర్శకుడు వివేక్ ఆత్రేయ.. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని వినగానే అభిమానుల్లో ఏదో తెలియని వైబ్రేషన్ మొదలైంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలయ్య బాడీ లాంగ్వేజ్ ను ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఎలా చూపిస్తాడు? మీరు ఎంచుకున్న కథ ఏది? అనే ఉత్కంఠ అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఒకటి కాకుండా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్మాత, దర్శకుడు, హీరో నిర్ణయించారు.
పౌరాణిక టచ్ ఉంటుందా?
వివేక్ ఆత్రేయ సిద్ధం చేసిన కథ స్కోప్ చాలా పెద్దదని, ఇందులోని ఎమోషన్స్, హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కేవలం మూడు గంటల్లో కుదించలేమని చిత్ర యూనిట్ భావిస్తోంది. కథలోని దమ్ము, పాత్రలోని డెప్త్ని గమనించిన బాలయ్య రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్రతిపాదనకు వెంటనే అంగీకరించాడు. ఈ భారీ యాక్షన్ డ్రామా కోసం పవర్ ఫుల్ టైటిల్ ‘కురుక్షేత్రం’ని పరిశీలిస్తున్నారు. ఈ పేరు వినగానే పౌరాణిక టచ్తో బాలయ్య మార్క్ సోషల్ డ్రామా రాబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కొద్ది రోజులు ఆగండి
షూటింగ్ విషయంలో దర్శకుడికి బాలకృష్ణ స్పష్టమైన వ్యూహాన్ని అందించాడు. రెండు పార్ట్ల షూటింగ్ని ఒకేసారి లేదా చాలా తక్కువ గ్యాప్తో పూర్తి చేయాలని బాలయ్య సూచించాడు. దీని వల్ల నటీనటుల లుక్లు మారకుండా ఉండటమే కాకుండా అవుట్పుట్పై క్లారిటీ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బాలయ్య సూచనకు వివేక్ కూడా అంగీకరించారు. విజయ దశమి తర్వాత ఏ రోజు అయినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆత్రేయ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ క్రేజ్కి వివేక్ ఆత్రేయ మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు వివేక్ ఆత్రేయ స్టైల్లోని ఆసక్తికరమైన ట్విస్ట్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మరి ఈ ‘కురుక్షేత్ర’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
