భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి మరోసారి విజయపతాకం ఎగురవేయనుంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16-17. ప్రత్యర్థి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి 10-12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, ఇతరులు 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్ కౌంట్ ప్రకారం ఓట్ల శాతం:
పీపుల్స్ పల్స్ విడుదల చేసిన గ్రాఫిక్ నివేదిక ప్రకారం, ఓట్ల చీలిక ఇలా ఉండబోతోంది:
- NDA (BJP+): 34% – 36%
- SPA (కాంగ్రెస్+): 30% – 32%
- TVK + NMK: 15% – 17%
- NTK: 4% – 6%
- VCK: 1% – 3%
- ఇతరులు: 2% – 5%

కూటమిలోని సీట్లను పార్టీల వారీగా అంచనా:
సీఎం రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ 10-12 సీట్లతో ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. బీజేపీ 5-6 సీట్లు, ఎల్జేకే 1-2, ఏఐఏడీఎంకే 0-1 సీట్లు గెలుచుకోగలవు. ఎస్పీఏ కూటమిలో డీఎంకేకు 6-8 సీట్లు రాగా, కాంగ్రెస్ 1-3 సీట్లకే పరిమితం కానుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే మరియు ఇతరులు కలిసి 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది.
రంగస్వామి చరిష్మా.. కేంద్రం అండ!
పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని 65 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా, ఎన్డీయే అంగీకరించింది. దాదాపు 68 శాతం మంది ప్రజలు రంగస్వామి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనపై 60 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తూ మరో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిపై ఏఐఎన్ఆర్సీకి 56 శాతం మద్దతు లభించగా, కాంగ్రెస్కు 24 శాతం మాత్రమే మద్దతు లభించింది.
