భారతదేశం
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ. గత ఎన్నికల్లో విఫలమైతే ప్రత్యామ్నాయ శక్తి లేదని చాటి చెప్పారు. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కాదని తేలిపోతుంది. చాపకింద నీరులా బీజేపీ బలపడుతుందంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
గోరఖ్పూర్ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి
బీజేపీ వర్గాలు కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత బెంగాల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, గోరఖ్పూర్ ఎంపీ రవి కిషన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రేసు గుర్రంలో విలన్గా నటించిన రవికిషన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ రాజకీయ మంటలు రేపాయి. అవి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మమతను టార్గెట్ చేసే రేసుగుర్రం విలన్
మమతా బెనర్జీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బంగ్లా చొరబాటుదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఆరోపణ ఆమెను ఆత్మరక్షణలో పడేసింది. ఇదే బీజేపీ ప్రధాన రాజకీయ ఆయుధం. ఇదే విషయంపై రవి కిషన్ మాట్లాడుతూ బెంగాలీ ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారని అన్నారు.
మమతను బానిసత్వం నుండి విముక్తి చేయడానికి ఒక ధర్మ పోరాటం
ఈ పోరాటం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అక్రమ బంగ్లాదేశ్ ఆక్రమణదారుల నుండి రక్షించడానికి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రవికిషన్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
మమతకు ప్రజలు గుణపాఠం చెబుతారు
అక్రమ చొరబాట్ల వల్ల బెంగాల్ సాంస్కృతిక మరియు జనాభా సమతుల్యత దెబ్బతింటుందని రవికిషన్ భయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈసారి ఓట్ల రూపంలో బెంగాల్ ప్రజల ఆలోచనలు మారాయని రవికిషన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
అక్రమార్కుల సమస్యకు బీజేపీయే శాశ్వత పరిష్కారం
సమూల మార్పు కోసం అందరూ బయటకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అక్రమార్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో బిజెపి ఎప్పుడూ లేవనెత్తుతున్న ‘చొరబాటు’ సమస్య జాతీయ భద్రతలో మరియు స్థానిక ఓటర్ల మద్దతును సమీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ వ్యూహాత్మక అడుగులు
రవికిషన్ లాంటి ప్రముఖ నేతలు ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు పెద్దఎత్తున వచ్చి ఓట్లు వేస్తారని రవికిషన్ చేసిన వ్యాఖ్యలతో ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు నిర్ధేశించబడుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
