క్రీడలు
ఓయ్-జక్కీ మహేష్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అరుదైన రికార్డు నెలకొల్పింది. సాధారణంగా టీ20 మ్యాచ్లు నాలుగు గంటల్లో ముగుస్తాయి. కానీ వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ పోరు 4 గంటల 23 నిమిషాల పాటు సాగింది. ఐపీఎల్ చరిత్రలో సూపర్ ఓవర్ లేకుండా సుదీర్ఘమైన మ్యాచ్ ఇది. రాత్రి 7 గంటలకు టాస్ వేశారు. ఆఖరి బంతి పడే సమయానికి దాదాపు రాత్రి 11:45 గంటలైంది.
ఈ సుదీర్ఘ మ్యాచ్పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దీనిపై కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య స్పందిస్తూ.. ‘ధురందర్ 2 సినిమా కంటే ఎక్కువసేపు సాగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ‘ధురందర్: ది రివెంజ్’ సినిమా రన్-టైమ్ దాదాపు 3 గంటల 50 నిమిషాలు ఉండగా, ఈ క్రికెట్ మ్యాచ్ కూడా దాన్ని దాటేసింది.

ఈ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో పట్టు బిగించింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 78) విధ్వంసకర ఇన్నింగ్స్తో ఈ మైదానంలో RCB అత్యధిక స్కోరు నమోదు చేసింది.
మ్యాచ్ అనంతరం రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ప్రతి మ్యాచ్లోనూ తమ జట్టు 200కు పైగా పరుగులు చేయడం కెప్టెన్గా తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు. స్పిన్నర్ కృనాల్ పాండ్యా కూడా బ్యాట్స్మెన్ ఆటతీరును మెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్ ఆడిన తీరు. జట్టు విజయంలో నిలకడ కీలక పాత్ర పోషించిందని కెప్టెన్ పాటిదార్ అన్నాడు.
