కదిలిన మలయాళ సూపర్ స్టార్లు | కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మలయాళ నటులు మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు

భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అవకాశం కల్పిస్తారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైంది. కేరళ- 140, అస్సాం- 126, పుదుచ్చేరి- 30 స్థానాలకు నేడు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక నేత అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి స్థానానికి పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలోని దావణగెరె సౌత్, బాగల్ కోటే నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మలయాళ నటులు మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు

కేరళలో 30,495 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు 883 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న 4.66 లక్షల మంది కొత్త ఓటర్లపై ఈ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎండ వేడిమికి కూడా 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్వగ్రామం పినరయిలోని ఆర్సీ అమల పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, పానక్కాడ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ సంకల్, పీకే కుంజలికుట్టి, మంత్రి పీఏ మహమ్మద్ రియాస్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీ సుకుమారన్ నాయర్ ఓటు వేశారు.

సినీ నటులు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన సతీమణి సుప్రియా మీనన్, ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోహన్ లాల్ తిరువనంతపురంలో, పృథ్వీరాజ్ కొచ్చిలో ఓటు వేశారు. త్రిసూర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సురేష్ గోపీ గురువాయూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే పలువురు ఎల్‌డిఎఫ్ నాయకులు మాట్లాడారు. తాము అధికారంలో కొనసాగుతామని విశ్వాసం వ్యక్తం చేస్తూనే.. ఈసారి ప్రభుత్వంలో మార్పు వస్తుందని యూడీఎఫ్ నేతలు స్పష్టం చేశారు.

More posts