భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
రేపు పశ్చిమ బెంగాల్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ 2026 దాదాపు పూర్తయింది. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ తర్వాత పెట్రోలు, డీజిల్ ఇప్పటికే ఇంధన ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంలో ధరలు పెరగడం లేదని ఇప్పటికే బీజేపీ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పెట్రో ధర పెరగబోతోందని చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్రం ఇవాళ క్లారిటీ ఇచ్చింది.
ఎల్లుండి పెట్రో ధరలు పెరుగుతాయన్న భయంతో ఆదివారం 400కు పైగా పెట్రోల్ బంకుల్లో ఆయిల్ అయిపోయింది. కొన్ని ఔట్లెట్లలో 30-33 శాతం వరకు డిమాండ్ పెరిగినట్లు సమాచారం. కొన్ని చోట్ల, మేము భయాందోళనలను గమనించాము మరియు మేము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.

పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. దయచేసి పుకార్లను నమ్మవద్దని అందరినీ కోరుతున్నాను. భయంతో కొనుగోళ్లు చేయడం మానుకోండి మరియు సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడండి. దేశంలో డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం నిల్వలు ఉన్నాయని చెప్పారు. ధరలు నిలకడగా ఉన్నాయని, పెంచేది లేదని స్పష్టం చేశారు.
